ఉపాధి హామీ కూలీ రేట్ల పెంపు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ కూ లీలకు ఈ ఏడాది చెల్లించనున్న రోజు కూలీని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా తెలంగాణకు రూ.272 ఖరారు చేశారు. ఏపీకి సైతం రూ.272నే నిర్ణయించారు. గతేడాది ఏప్రిల్ నాటికి ఉపాధి కూలీలకు తెలంగాణలో చెల్లిస్తున్న రోజు వేతనం రూ.257 ఉండగా దానికి మరో రూ.15 పెంచారు.
అత్యధికంగా హర్యానాలో రూ.357 కాగా, అత్యల్పంగా మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో రూ.221 ఖరారు చేశారు. 2013లో ఖరారు చేసిన చట్టంలో పలు సవరణలు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు శనివారం నుంచి అమల్లో రానున్నట్లు ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
©️ VIL Media Pvt Ltd. 2023-04-01T03:21:10Z dg43tfdfdgfd