ఈ-కామర్స్ ఎగుమతులను పెంచడంపై స్పెషల్ ఫోకస్
న్యూఢిల్లీ: ఎగుమతులను భారీగా పెంచడమే టార్గెట్గా నరేంద్ర మోడీ సర్కారు సరికొత్త ఫారిన్ ట్రేడ్ పాలసీని తీసుకొచ్చింది. కేంద్ర కామర్స్, ఇండస్ట్రీస్ మినిస్టర్ పీయుష్ గోయల్ దీనిని ప్రకటించారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూపాయిని గ్లోబల్ కరెన్సీగా డెవెలప్ చేయడంతోపాటు, ఈ–కామర్స్ ఎగుమతులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఎగుమతిదారులు, రాష్ట్రాలు, జిల్లాలు, ఇండియన్ మిషన్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ల ఖర్చులను తగ్గించి, మరిన్ని ఎక్స్పోర్ట్స్ హబ్స్ను అభివృద్ధి చేయడంపై కొత్త పాలసీ ఫోకస్ చేస్తుంది. శుక్రవారంతో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎగుమతుల విలువ 765 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. అంతకుముందు సంవత్సరంలో వీటి విలువ 676 మిలియన్ డాలర్లు. ఇది వరకు ఐదేళ్లకు ఒకసారి ఫారిన్ ట్రేడ్ పాలసీని (ఎఫ్టీపీ) మార్చేవాళ్లు. ప్రస్తుత ఎఫ్టీపీకి ముగింపు తేదీ ఏమీ ఉండదు. గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) సంతోష్ సారంగి అన్నారు. కొత్త ఎఫ్టీపీ గురించి రాబోయే 4–5 నెలలపాటు తమ మంత్రిత్వ శాఖ దేశమంతటా ప్రచారం చేస్తుందని పీయుష్ గోయల్ వెల్లడించారు. ఇందుకోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని ఇండియన్ మిషన్స్ తమతో కలిసి పనిచేస్తాయని వివరించారు.
రూపాయితో భారీ బిజినెస్
రూపాయిని గ్లోబల్ కరెన్సీగా డెవెలప్ చేయడంతోపాటు రూపాయల్లోనే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్లు జరిగేలా చూడటం కొత్త ఎఫ్టీపీ లక్ష్యం. రూపాయిల్లో బిజినెస్ చేసే ఎగుమతిదారులకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. కరెన్సీ ఫెయిల్యూర్, డాలర్ల కొరత ఉన్న దేశాలతో రూపాయల్లో బిజినెస్ చేస్తామని కామర్స్ సెక్రెటరీ సునీల్ బర్తవాల్ వివరించారు. ఇండియన్ ఎక్స్పోర్టర్లు గ్లోబల్ మార్కెట్లలో మరింత పోటీపడాలని, సబ్సిడీలపై ఆధారపడకూడదని సూచించారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) స్కీమ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ప్రకారం తమ ఈఓని పూర్తి చేయలేని ఎగుమతిదారులకు ఎఫ్టీపీ మినహాయింపులు అందిస్తుంది. ప్రత్యేక రసాయనాలు, మెటీరియల్స్, పరికరాలు, టెక్నాలజీలు (స్కోమెట్) కింద డ్యూయల్ యూజ్వస్తువుల ఎగుమతులను సులభతరం చేయడం కూడా ఎఫ్టీపీ లక్ష్యం. యూఏవీ/డ్రోన్లు, క్రయోజెనిక్ ట్యాంకులు, రసాయనాలు వంటి డ్యూయల్ యూజ్ హై ఎండ్ గూడ్స్/టెక్నాలజీని ఎగుమతులను సులభతరం చేసే విధానాలపై కూడా ఇది దృష్టి సారిస్తుంది. ప్రతి జిల్లాలో ఉత్పత్తులు, సేవలను గుర్తించి ఆయా జిల్లాలను ఎక్స్పోర్ట్స్ హబ్స్గా గుర్తిస్తుంది.
ఈ-కామర్స్ ఎగుమతులను పెంచడంపై స్పెషల్ ఫోకస్
2030 నాటికి ఈ-కామర్స్ ఎగుమతులు 200-300 బిలియన్ డాలర్లకు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఎఫ్టీపీలోని అన్ని ప్రయోజనాలను వీటికీ వర్తింపజేయాలని నిర్ణయించారు. కొరియర్ ద్వారా పంపే సరుకు వాల్యూ లిమిట్ను రెట్టింపు చేసి రూ. 10 లక్షలకు పెంచారు. స్టాకింగ్, కస్టమ్స్ క్లియరెన్స్, రిటర్న్ల ప్రాసెసింగ్లో ఈ–-కామర్స్ అగ్రిగేటర్లకు సహాయం చేయడానికి గిడ్డంగుల సౌకర్యంతో ప్రత్యేక జోన్ను రూపొందించాలని కూడా ప్రతిపాదించారు. లేబులింగ్, టెస్టింగ్ రీప్యాకేజింగ్ వంటి లాస్ట్మైల్ కార్యకలాపాల కోసం ప్రాసెసింగ్ సౌకర్యాన్ని అనుమతిస్తారు. ఈ–కామర్స్ కింద తదుపరి ఎగుమతులను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖలతో ఇతరులతో సంప్రదించాక మార్గదర్శకాలు రూపొందిస్తారు. కళాకారులు, చేనేత కార్మికులు, ఇతర కళాకారులు, చిన్న ఇండస్ట్రీల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులను పెంచడానికి డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాలను మొదలుపెడతారు. ఈ-కామర్స్ ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ రంగం కోసం రూపొందించిన ప్రోత్సాహక పథకాల తరహాలో, సాఫ్ట్వేర్ రంగానికి కూడా ఒక పథకాన్ని రూపొందిస్తారు. ఆర్డీటీఈపీ, ఆర్ఓఎస్సీటీఎల్ ద్వారా పలు డ్యూటీలను, ట్యాక్స్లను రద్దు చేశారు. దీనివల్ల ఎగుమతిదారులకు మేలు జరుగుతుంది. ఈ–కామర్స్ ఎగుమతులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ వల్ల ఎగుమతులు మరింత పెరుగుతాయి.
‑ ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ కుమార్ గరోడియా
©️ VIL Media Pvt Ltd. 2023-04-01T03:21:10Z dg43tfdfdgfd